అపోలో ఆసుపత్రిలో మణిరత్నం... గుండెపోటా? కాదు కాదంటున్న పీఆర్వో

గురువారం, 26 జులై 2018 (16:43 IST)
దక్షిణాది సినీ దర్శకుడు, నటి సుహాసిని భర్త మణిరత్నంకు గుండెపోటు వచ్చిందంటూ వార్తలు వచ్చాయి. గుండెపోటు రావడంతో ఆయనను వెంటనే చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారని పలు మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఐతే దీనిపై మణిరత్నం పీఆర్వో నిఖిల్ మురుగున్ స్పందిస్తూ... మణిరత్నం బాగానే వున్నారని ట్వీట్ చేశారు.
 
కేవలం రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే అపోలో ఆసుపత్రికి వచ్చినట్లు తెలిపారు. ఆయన ఆరోగ్యానికి ఎలాంటి సమస్య లేదని వెల్లడించారు. కాగా ఇంతకుముందు ఓసారి మణిరత్నం గుండె సంబంధ సమస్యను ఎదుర్కొన్నారు. ఇప్పుడు అపోలో ఆసుపత్రికి వెళ్లగానే అంతా అదేననుకుని వార్తలు రాశారు. ఇకపోతే ప్రస్తుతం మణిరత్నం తన తదుపరి చిత్రం చెక్క చివంత వనం మూవీ పోస్టు ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తెలుగులో నవాబ్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు