దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్లో సెక్యూరిటీ హత్య, ఆపై అమ్మ డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటనలు మరిచిపోకముందే.. జయమ్మ నివాసంలో వంటమనిషిగా పనిచేసిన పంజవర్ణం అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అయితే ఈ దాడిలో వంటమనిషి ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు.