మణిపూర్‌లో భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై 4గా నమోదు

శనివారం, 4 ఫిబ్రవరి 2023 (11:08 IST)
మణిపూర్‌ను భూకంపం వణికించింది. ఉఖ్రూల్‌లో శనివారం ఉదయం 6.14 గంటలకు భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్‌స్కేల్‌పై 4 తీవ్రతగా నమోదయింది. 
 
దీంతో జనంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు.  ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికారులు తెలిపారు.
 
అయితే ఈ భూకంపంతో ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇకపోతే.... శుక్రవారం రాత్రి హర్యానా, పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్ ప్రాంతంలోనూ భూకంపం సంభవించింది. 

వెబ్దునియా పై చదవండి