దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. బుధవారం మధ్యాహ్నం సీఈసీ మీడియా సమావేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నజీమ్ అహ్మద్ జైదీ వివరాలను వెల్లడించారు. బుధవారం నుంటే ఈ ఎన్నికల నియామవళి అందుబాటులోకి రానుంది. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లో ఎన్నికలు జరగనున్నాయి.
* ఉత్తర్ ప్రదేశ్లో మే నెలలో ఎన్నికలు.
* మణిపూర్, గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో మార్చి 18న ఎన్నికలు.
* ఉత్తరాఖండ్లో మార్చి 26న ఎన్నికలు.
* యూపీలో 403, పంజాబ్ 117, ఉత్తరాఖండ్ 70, మణిపూర్ 60, గోవాలో 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఇక ఓటర్ల స్లిప్పులను ఎన్నికల సంఘమే పంపిణీ చేస్తుందని, ఈవీఎంలో తొలిసారిగా ఫొటోలతో అభ్యర్థుల జాబితా వుంటుందన్నారు. కొన్ని చోట్ల మహిళలకు, వికలాంగులకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలుంటాయని, ఎవరికి ఓటు వేశామో తెలుసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు.