బీహార్ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత..! వృద్ధాప్యకారణాలతోనే..!

శుక్రవారం, 6 మార్చి 2015 (11:46 IST)
బీహార్ మాజీ ముఖ్యమంత్రి జేడీయూ సీనియర్ నేత రామ్ సుందర్ దాస్ (95) కన్నుమూశారు. గత కొంత కాలంగా వృద్ధాప్యకారణాలతో అనారోగ్యంతో బాధపడుతున్న రామ్ సుందర్ దాస్ శుక్రవారం ఉదయం తుదిశ్వాశ విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 
 
రామ్ సుందర్ దాస్ మృతి పట్ల బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రామ్ సుందర్ కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన భార్య గతంలోనే మృతి చెందారు.

వెబ్దునియా పై చదవండి