అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన డీఎంకే నేత, నటుడు నెపోలియన్!

ఆదివారం, 21 డిశెంబరు 2014 (15:41 IST)
సినీ నటుడు, డీఎంకేకు చెందిన కేంద్ర మాజీ మంత్రి నెపోలియన్ ఆదివారం జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కోలీవుడ్‌లో ప్రముఖ నటుడిగా పేరుగాంచిన నెపోలియన్ 2009 ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థిగా బరిలోకి దిగి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత యూపీఏ-2 సర్కారులో సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 
 
తాజాగా ఆయన అమిత్ షా సమక్షంలో డీఎంకేను వీడి బీజేపీలో చేరారు. శనివారం ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడు గంగై అమరన్‌ బీజేపీలో చేరిన మరుసటిరోజే కేంద్ర మాజీ మంత్రి కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. 2016లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సీఎం అభ్యర్థిని ప్రకటించాకే బరిలోకి దిగుతామని ఆయన ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి