అక్రమ మైనింగ్ కేసులో కర్ణాటక మాజీ ఎమ్మెల్యే, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రధాన ప్రముఖుడు గాలి జనార్ధన్ రెడ్డి తెలంగాణ హైకోర్టు భారీ ఊరట కల్పించింది. గత నెల (మే 5న) సీబీఐ ప్రత్యేక కోర్టు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష పడిన ఆయన, ఆ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.
బుధవారం ఆయన వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, శిక్షను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పుతో రెడ్డికి శ్వాస సులభమైంది. అయితే కొన్ని కఠినమైన షరతులతోనే ఈ ఉపశమనం లభించింది.
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు సంబంధించిన కేసులో, గాలి జనార్ధన్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని కూడా సీబీఐ కోర్టు దోషులుగా ప్రకటించింది. ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా కూడా విధించింది. ఈ తీర్పు వెలువడిన తర్వాత కర్ణాటక శాసనసభ గాలి శాసనసభ్యత్వాన్ని రద్దు చేసింది.