భార్యతో ఏర్పడిన వివాదం.. ముగ్గురు కుమారుల్ని పీకకోసి చంపేసిన కానిస్టేబుల్

మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (11:30 IST)
భార్యాభర్తల మధ్య ఏర్పడిన వివాదం ముగ్గురు సంతానాన్ని పొట్టనబెట్టుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో మానవీయ అనుబంధాలు గాడితప్పుతున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల సంబంధాలు చిన్న చిన్న గొడవలకే విడాకులు వరకు వెళ్తున్నాయి. అంతేగాకుండా దారుణ హత్యలకు దారితీస్తున్నాయి. 
 
తాజాగా భార్యతో ఏర్పడిన గొడవ కారణంగా ఓ భర్త తన ముగ్గురు సంతానాన్ని పీకకోసి హతమార్చాడు. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌, భావ్ నగర్‌కు చెందిన కానిస్టేబుల్ సుక్దేవ్ సియాల్. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం పూట సుక్దేవ్‌కు ఆతని భార్యతో గొడవలు జరిగాయి. ఈ వివాదం కారణంగా తన ముగ్గురు కుమారులు గుజాల్ (9), ఉద్దవ్ (5), మన్మీట్ (3)లను ఆవేశంతో గొంతుకోసి హత్య చేశాడు సుక్దేవ్. ఆపై సుక్దేవ్ సమీపంలోని పోలీస్ స్టేషన్‍‌లో లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుక్దేవ్ దంపతుల వద్ద విచారణ జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు