హైస్కూల్ స్టూడెంట్‌పై లైంగిక వేధింపులు.. మఠాధిపతి ఆత్మహత్య

సోమవారం, 5 సెప్టెంబరు 2022 (16:20 IST)
Guru Madiwaleshwara Math
పోక్సో కేసులో చిత్రదుర్గ మురుగ మఠాధిపతి శివమూర్తి శరణారు ఏకంగా అరెస్ట్‌ అయ్యాడు. హైస్కూల్ స్టూడెంట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో ప్రస్తుతం శివమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. తాజాగా.. ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొన్న మఠాధిపతి ఒకరు సోమవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు.
 
వివరాల్లోకి వెళితే.. బెలగావిలోని శ్రీ గురు మదివాలేశ్వర్‌ మఠ్‌కు చెందిన బసవ సిద్ధలింగ స్వామి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనాస్థలంలో సూసైడ్‌ నోట్‌ దొరికింది. అయితే అందులో ఏముందనేది మాత్రం పోలీసులు వెల్లడించలేదు.
 
తన క్వార్టర్స్‌లోనే ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు అనుచర గణం పోలీసులకు వెల్లడించింది. తాజాగా ఇద్దరు కర్ణాటకలోని మఠాలలో జరుగుతున్న లైంగిక దాడుల గురించి ప్రస్తావిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అది సంచలనంగా మారింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు