ఇదిలావుండగా, సభ ప్రారంభమైన వెంటనే విశ్వాస పరీక్ష తీర్మానాన్ని సీఎం పళనిస్వామి ప్రవేశపెట్టారు. అసెంబ్లీకి మొత్తం 231మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అసెంబ్లీ ప్రారంభమైన కొద్దిసేపటికే తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభలో డీఎంకే ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.