డిజిటల్ చెల్లింపులతో దూసుకుపోతున్న భారత్: ప్రధాని మోదీ ఏమన్నారంటే?

బుధవారం, 13 ఏప్రియల్ 2022 (16:25 IST)
కరెన్సీ నోట్ల వాడకం బాగా తగ్గింది. కరోనా వైరస్ పుణ్యమా అని చాలామంది కరెన్సీ నోట్లు తీసుకోవడం మానేశారు. క్రమంగా జి-పే, ఫోన్ పే, నెట్ బ్యాంకింగ్... తదితర మార్గాల ద్వారా నగదు బదిలీ చేస్తున్నారు. ఈ లావాదేవీలు ఎలా జరుగుతున్నాయన్నదానిపై ఇండియా ఇన్ పిక్జల్స్ సమగ్రంగా ఓ గ్రాఫ్ ద్వారా చూపించింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.

 
ఆయన ట్విట్టర్ ద్వారా తెలుపుతూ.... ''నేను UPI, డిజిటల్ చెల్లింపుల గురించి చాలా తరచుగా మాట్లాడుతున్నాను, అయితే ఆ వాడకం ఎలా వుందో సమర్థవంతంగా తెలియజేయడానికి మీరు డేటా సోనిఫికేషన్ ద్వారా లావాదేవీలు జరిపిన డబ్బును ఎలా ఉపయోగించారో నాకు బాగా నచ్చింది. చాలా ఆసక్తికరమైన, ఆకట్టుకునే, స్పష్టమైన సమాచారం చూస్తున్నా''
 

I’ve spoken about UPI and Digital Payments quite often but I really liked how you’ve used the sound of money transacted through data sonification to effectively convey the point.

Very interesting, impressive and obviously informative! @indiainpixels https://t.co/rpsjejjR9J

— Narendra Modi (@narendramodi) April 13, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు