ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రూ. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో సోషల్ మీడియాలో రూ.500 నోట్లు, వెయ్యి రూపాయల నోట్లు స్నాక్స్ పొట్లాలు మడిచేందుకే పరిమితమంటూ నెట్లో హల్ చల్ చేశాయ్. ఈ ఫోటోలను షేర్ల మీద షేర్ చేసుకుంటున్నారు. ఇక కామెంట్లు అయితే ఓ రేంజ్లో వస్తున్నాయి.. ఎవరికి నచ్చిన రీతిలో వారు కామెంట్లు చేస్తున్నారు.
నిజానికి 500, 1000 నోట్లను రద్దు చేయాలన్న ప్రకటన వెలువడినప్పటి నుంచి అర్థరాత్రి దాటిపోయే వరకు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూనే ఉన్నారు. ఇంకొందరైతే మేం రూ. 500, 1000 రూపాయల నోట్లను తీసుకోవడానికి ఏమీ అభ్యంతరం లేదు.. పాత న్యూస్ పేపర్లాగా పాతనోట్లను కేజీ 12 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తామంటూ ఈ నంబర్లకు కాంటాక్ట్ చేయగలరు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా రూ. 500, 1000 రూపాయల నోట్లకు RIP చెప్పేశారు.
మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నోట్ల రద్దు నిర్ణయంతో తాను షాకయ్యానంటూ ఎమ్మెల్సీ సోమిరెడ్డి అన్నారు. వెంటనే తన బీరువా తీసి చూసుకున్నాను. 26 వెయ్యి రూపాయల నోట్లు ఉన్నాయి. వాటిని ఎలా మార్చాలా అని ఆందోళన చెందానని.. తానే ఈ రకంగా ఆందోళన చెందితే సోదరుడు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఎంతగా ఆందోళన చెందారో? అంటూ ఎద్దేవా చేశారు. బెంగళూరు వైట్ హౌస్లో భూగర్బంలో ఉన్న డబ్బును ఏం చేయాలో తెలియక షాకై ఉంటారు.