ఉత్తరప్రదేశ్‌లో కూలిన ఐఏఎఫ్ జెట్.. 7గురి దుర్మరణం!

శుక్రవారం, 25 జులై 2014 (19:43 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారత వైమానిక దళానికి చెందిన హెలికాఫ్టర్ ప్రమాదవశాత్తు కూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు మరణించారు. కూలిన హెలికాప్టర్‌ను భారత్ రూపొందించిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్)గా పోలీసులు గుర్తించారు. బరేలీ నుంచి అలహాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గత మూడేళ్లలో 11 ఐఏఫ్ హెలికాప్టర్లు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో వాంగ్ కమాండర్‌, స్క్వాడ్రన్ లీడర్‌ కూడా ఉన్నారు. 
 
శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు బారైలీ నుంచి అలహాబాద్‌కు బయలుదేరగా లక్నోకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో లక్నో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయి కూలిపోయింది. దీనిపై సిద్దౌలి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఏకే శ్రీవాస్తవ స్పందిస్తూ.. అటారియా ఏరియాలోని మనిపుర్వా అనే ప్రాంతంలో కూలిపోయినట్టు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి