భారత్- శ్రీలంకల మధ్య రామసేతు వంతెన కాల్పనికం కాదు.. ఇస్రో

సెల్వి

సోమవారం, 15 జులై 2024 (17:10 IST)
భారత్-శ్రీలంక మధ్య తమిళనాడులోని రామేశ్వరం ద్వీపంకు సంబంధించిన వంతెనపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీలక మ్యాప్‌ను విడుదల చేసింది. భారత్- శ్రీలంకల మధ్య రామసేతు అనే ఈ వంతెన కాల్పనికం కాదని.. నిజమేనని ఇస్రో స్పష్టం చేసింది. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐస్‌శాట్-2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్‌ను విడుదల చేశారు. 
 
ఈ వంతెన పొడవు 29 కిలోమీటర్లు. దీని ఎత్తు సముద్రగర్భం నుంచి 8 మీటర్లు వున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ సేతువు 99.98 శాతం నీటిలో మునిగి వుందని.. ఇది రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోడి నుంచి శ్రీలంక మన్నారు ద్వీపంలోని తలైమన్నార్ వాయవ్య దిశ వరకు విస్తరించి వుంది. దీనిని సున్నపు రాతితో నిర్మించినట్లు ఇస్రో తెలుసుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు