గుజరాత్ రాష్ట్రంలోని అమ్రెలీ జిల్లాకు చెందిన ఓ డాక్టరు నలుగురు అమ్మాయిలను జైపూర్ నగరానికి తీసుకువచ్చి వారితో వ్యభిచారం చేయిస్తూ వచ్చాడు. జైపూర్ నగరంలోని వైశాలీనగర్ ప్రాంతంలోని ఓ అపార్టుమెంటులోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని గుట్టు చప్పుడు కానివ్వకుండా వ్యభిచారం చేయిస్తూ వచ్చాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.
దీంతో పోలీసులు విటుడి వేషంలో ఓ పోలీసు అధికారిని పంపించి డాక్టరుతోపాటు నలుగురు అమ్మాయిలను వలపన్ని పట్టుకున్నారు. జైపూర్ నగరంలో జరిగే వైద్య సదస్సులో పాల్గొనేందుకు జైపూర్ వచ్చానని వైద్యుడు చెపుతున్నాడు. జమ్మూ, కాశ్మీర్, ముంబై, ఉత్తరప్రదేశ్, జైపూర్ ప్రాంతాలకు చెందిన నలుగురు అమ్మాయిలపై పోలీసులు పిటా కింద కేసు నమోదు చేశారు.