ఇదే అంశంపై శ్రీనగర్లో వివరణ ఇస్తూ, హురియత్ కాన్ఫరెన్స్, పాకిస్థాన్, మిలిటెంట్ సంస్థలు సానుకూలంగా వ్యవహరించడం వల్లే ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని తాను భావిస్తున్నానని మరోమారు పునరుద్ఘాటించారు. పాకిస్థాన్, హురియత్ కాన్ఫరెన్స్లు భారత రాజ్యాంగం గుర్తించినవేనని, వాటి గురించి మాట్లాడితే ఆందోళన చేయడం సరికాదని ఆయన హితవు పలకడం గమనార్హం.