నేను చేసిన వ్యాఖ్యలు అక్షరాలా సత్యం.. వెనక్కి తీసుకోను : జేకే సీఎం

మంగళవారం, 3 మార్చి 2015 (09:18 IST)
జమ్మూకాశ్మీర్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలు అక్షరాలా సత్యమని అందువల్ల వాటిని వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ సయీద్ స్పష్టం చేశారు. పార్లమెంటులోని ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఆందోళన నిర్వహించినప్పటికీ ఆయన తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గకపోవడం విశేషం. 
 
ఇదే అంశంపై శ్రీనగర్‌లో వివరణ ఇస్తూ, హురియత్ కాన్ఫరెన్స్, పాకిస్థాన్, మిలిటెంట్ సంస్థలు సానుకూలంగా వ్యవహరించడం వల్లే ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని తాను భావిస్తున్నానని మరోమారు పునరుద్ఘాటించారు. పాకిస్థాన్, హురియత్ కాన్ఫరెన్స్‌లు భారత రాజ్యాంగం గుర్తించినవేనని, వాటి గురించి మాట్లాడితే ఆందోళన చేయడం సరికాదని ఆయన హితవు పలకడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి