ఈ నేపథ్యంలో అపోలో హాస్పిటల్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమ్మకు గుండెపోటు రావడంతో తమిళనాట అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అపోలో ఆస్పత్రి వద్ద అభిమానులు అమ్మకు గుండెపోటు అనగానే కన్నీళ్లు పెట్టుకున్నారు.
మరోవైపు అమ్మ ఆరోగ్య పరిస్థితిపై వార్తలు విన్న ప్రముఖులు ట్విట్టర్లో ఆమె కోలుకోవాలని ఆశిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్ అమ్మ త్వరలో కోలుకోవాలని ఆశిస్తున్నారు.
భారీ భద్రతలో భాగంగా 9 రాపిడ్ యాక్షన్ ఫోర్స్లు ఇప్పటికే అపోలో వద్దకు చేరుకున్నాయి. తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ అపోలో చేరుకున్నారు. ఆమె ఆరోగ్యంపై వైద్యుల వద్ద ఆరా తీశారు. రాష్ట్ర పరిస్థితులపై దృష్టి పెట్టారు. అమ్మ త్వరలో కోలుకోవాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ఆకాంక్షించారు. కాగా జయలలితకు గుండెపోటు వార్త వినగానే చెన్నైలోని పలు సినిమా హాల్స్ తమ షోలను రద్దు చేసుకున్నాయి.