ఆదివారం అమ్మకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని వార్తలు రావడంతో ఇన్నాళ్ళు అమ్మ కోలుకోవాలని చేసిన ప్రార్థనలు, పూజలు ఏమయ్యాయని వారు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా అమ్మ ఆరోగ్యంపై మాత్రం అన్నాడీఎంకే క్యాడర్ నమ్మకంతో ఉంది. ఆమె త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని.. ఆమె ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండబోదని గట్టిగా నమ్ముతున్నారు.
కాగా 68 ఏళ్ల జయలలితకు విదేశాల నుంచి వైద్యులు అపోలోకు వచ్చి వైద్యం అందించారు. చికిత్స చేయించారు. అలాగే సింగపూర్ నుంచి రోబోలు కూడా అమ్మకు ఫిజియో చికిత్స ఇప్పించేందుకు చెన్నైకి వచ్చాయి. కానీ ఉన్నట్టుండి ఆమెకు గుండెపోటు రావడంపై ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు డీలా పడిపోయారు. ఇదిలా ఉంటే.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తమిళ సీఎం జయలలిత గుండెపోటు వార్తపై స్పందించారు. యావత్తు భారత దేశం జయలలిత వెంటే ఉందని.. ఆమె వేగంగా కోలుకోవాలని మోడీ ఆశించారు.