దీనిపై సీబీఐ వర్గాలు స్పందిస్తూ.. తాము ఇప్పటికే పలు ప్రాజెక్టులకు సంబంధించి పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలు ఇచ్చిన అనుమతులను పరిశీలించామని, వాటి పత్రాలను సేకరించామని పేర్కొంటున్నాయి. ఆమె తీసుకున్న నిర్ణయాల వెనుక ఎవరి ప్రోద్బలం ఉందన్న విషయాన్ని తొలుత విచారించాలన్నది సీబీఐ అభిమతంగా తెలుస్తోంది.