పట్టాలు తప్పిన బెంగుళూరు ఎక్స్‌ప్రెస్.. ఎందుకో తెలుసా?

శుక్రవారం, 12 నవంబరు 2021 (16:03 IST)
బెంగుళూరు ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. కున్నూరు బెంగుళూరుల మధ్య నడిచే ఈ ఎక్స్‌ప్రెస్ రైలు శుక్రవారం వేకువజామున 3.50 గంటల సమయంలో పట్టాలు తప్పింది. కొండచరియలు విరిగిపడటంతో మొత్తం ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదం తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లాలో బెంగుళూరు డివిజన్‌ పరిధిలోని తొప్పూర్, శివడి స్టేషన్ల మధ్య జరిగింది. 
 
ఈ ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 2,348 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారని రైల్వేశాఖ ప్రకటించింది. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. తమిళనాడులో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు.

 

Around 3.50 am today, 5 coaches of Kannur-Bengaluru Express derailed b/w Toppuru-Sivadi of Bengaluru Division, due sudden falling of boulders on the train. All 2348 passengers on board are safe, no casualty/injury reported: South Western Railway (SWR)

(Photo source: SWR) pic.twitter.com/Yq9hhxIkQo

— ANI (@ANI) November 12, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు