ప్రజల్లో మూఢనమ్మకాలపై చైతన్యం తీసుకువచ్చేందుకు ఆయన శ్మశానంలో ఓ రాత్రి గడపాలని నిశ్చయించుకున్నారు. బెళగావి నగరంలో డిసెంబర్ 6వ తేదీన అంబేద్కర్ వర్థంతిని పురస్కరించుకుని, వైకుంఠధామ్ శ్మశాన వాటికలో నిద్రించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
దీనిపై మంత్రి మాట్లాడుతూ, తనకు ఈ ఆలోచన ఎప్పటి నుంచో ఉందని, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా తన ప్రచారం బెళగావి నుంచి మొదలవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి రాజకీయనేతలను ఎవరినీ పిలవడంలేదని తెలిపారు. ప్రజల్లో అవగాహన కలిగించేందుకు శ్మశానమే అత్యుత్తమ ప్రదేశమని అభిప్రాయపడ్డారు.