మంచి అమ్మాయితో పెళ్లి చేయలేదని మధ్యవర్తిగా నిలిచిన వ్యక్తిని ఓ యువకుడు హతమార్చాడు. కొత్తపల్లి మండలంలోని లింగాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చాలాకాలం పెళ్లి సంబంధాలు చూస్తున్నానని, మంచి అమ్మాయి కోసం వెతుకుతున్నానని చెప్పిన మధ్యవర్తిపై ప్రసాద్ అనే వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు.
గోపన్న అనే మధ్యవర్తి చాలాకాలంగా సంబంధాలు చూస్తున్నానని విసిగిస్తూ.. డబ్బు లాక్కునే వాడని.. అయితే అమ్మాయిని మాత్రం చూపించకపోవడంతో కోపంతో ఈ పని చేశాడని తెలిసింది. రోకలి బండతో గోపన్న తలపై మోదడంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు.
అందుకే తిరిగి ఇంటికి చేరుకోలేనని.. తల్లిదండ్రుల ముఖం ఎలా చూడగలనని మదనపడి.. ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్ రాసి చనిపోయింది. తన మరణంలో తన స్నేహితులకు కానీ, బాయ్ ఫ్రెండ్స్కు వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. కానీ ఆ బాలిక తల్లిదండ్రులు మాత్రం అమ్మాయి బాయ్ ఫ్రెండే ఇందుకు కారణమని ఆరోపిస్తున్నారు.