అవును.. నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను.. సొంతగూటికి వచ్చేశా!: ఖుష్బూ

బుధవారం, 26 నవంబరు 2014 (18:54 IST)
యస్.. సినీ నటి ఖుష్బూ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమైన అనంతరం ఖుష్బూ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ప్రకటించారు. సోనియా గాంధీ సమక్షంలో తాను పార్టీలో చేరానని తెలిపారు. మళ్లీ సొంతింటికి వచ్చానని చెప్పారు. 
 
తమిళనాట కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని ఖుష్బూ అభిప్రాయపడ్డారు. డీఎంకే నుంచి బయటకు వచ్చిన ఆరునెలల తరువాత ఖుష్బూ పార్టీ మారడం విశేషం. గతంలో ఖుష్బూ బీజేపీలోకి వెళ్తారని తమిళనాట ఊహాగానాలు వెల్లువెత్తాయి.
 
ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ చేరారు. ఖుష్బూ చేరికతో తమిళనాట కాంగ్రెస్ కార్యకర్తలకు ఊపొస్తుందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి