తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మద్యనిషేధ అంశం ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. దీంతో ప్రతి రాజకీయ నేత కూడా ఈ అంశాన్నే పదేపదే ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మద్యం నిషేధాలకు బ్రేక్ పడొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఒక్కసారిగా మద్యం అమ్మకాలు 20 శాతం మేరకు పెరిగిపోయాయి.