క్వారంటైన్‌లో మహిళ.. లైంగికంగా వేధించిన వ్యక్తి.. ఎక్కడ?

బుధవారం, 27 మే 2020 (17:40 IST)
కరోనా లాంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చినా.. కామాంధుల తీరు మారలేదు. కరోనా వైరస్ సమయంలో క్వారంటైన్ కేంద్రంలో ఉన్న మహిళ మీద కూడా లైంగిక వేధింపులకు ఓ వ్యక్తి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నాంహోరీ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలోని క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేశారు.
 
గ్రామానికి చెందిన 23 సంవత్సరాల యువతి ఈనెల 15వ తేదీన పూణె నుంచి సొంతూరుకు వచ్చింది. కోవిడ్ 19 నిబంధనల ప్రకారం ఆమెను జిల్లా పరిషత్ పాఠశాలలోని క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. 
 
అయితే, ఇతరులకు ప్రవేశంలేని ఆ పాఠశాలలోకి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చొరబడి ఆమె మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు