క్వారంటైన్‌లో ఉంటున్న మహిళలపై లైంగికదాడి.. ఎక్కడ?

సోమవారం, 22 జూన్ 2020 (09:56 IST)
కరోనా వైరస్ బారినపడిన వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్లకు తరలిస్తున్నారు. అయితే, కొందరు కామాంధులు ఈ క్వారంటైన్‌లలో చికిత్స పొందే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ క్వారంటైన్‌ కేంద్రంలోని మహిళలపై లైంగిక దాడి చేసిన యువకుడిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. 
 
తాజాగా పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... క్వారంటైన్‌ కేంద్రంలోని బాత్‌రూమ్ వద్ద ఉన్న ఓ మహిళ పట్ల శంకర్ అనే కామాంధుడు అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే అతడి నెట్టేసిన బాధితురాలు అక్కడి నుంచి పారిపోయింది. ఆమెను వెంబడించే క్రమంలో ఉన్న శంకర్.. ఓ రూంలో నిద్ర పోతున్న మరో యువతిని చూశాడు. 
 
ఆ గదిలోకి ప్రవేశించి ఆమెపై లైంగిక దాడి చేయబోయాడు. అయితే అదే గదిలో ఉన్న ఇతర మహిళలు రక్షించాలంటూ పెద్ద ఎత్తున కేకలు వేయండంతో అక్కడున్న వారు శంకర్ ప్రయాత్నాలను అడ్డుకుని అతడిని బంధించి పోలీసులకు అప్పగించారు. 
 
కాగా.. గదిలో ఉన్న బాధితురాలి స్వస్థలం ముంబై అని, ఇటీవల బెంగళూరు వచ్చి ప్రభుత్వం నిర్ధేశించిన క్వారంటైన్‌లో ఉంటోందని పోలీసు అధికారులు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు