జల్లికట్టును నిర్వహించేందుకు అనుమతినిస్తూ తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ తాత్కాలికమైనదే. అయితే, దీనిపై గవర్నర్ సంతకం చేసి ఆమోదముద్ర వేశారు. అయినా ఈ ఆర్డినెన్స్ తాత్కాలికమైనదనడం నిజమేనని జస్టిస్ కట్జూ చెప్పారు. అయితే తమిళనాడు శాసనసభ సోమవారం సమావేశం కాబోతోందని, ఈ ఆర్డినెన్స్ స్థానంలో చట్టాన్ని ఆమోదిస్తుందని, అది శాశ్వతమైనదవుతుందని తెలిపారు.
ఈ విధంగా చేసిన చట్టంపై కోర్టులో సవాలు చేసే అవకాశం ఉందని, అయితే ఇది విజయవంతం కాకపోవచ్చునని తెలిపారు. దీనికి కారణం రాజ్యాంగంలోని అధికరణ 254(2) ప్రకారం రాష్ట్రపతి ఆమోదం లభించడమేనని పేర్కొన్నారు. అందువల్ల జల్లికట్టు మద్దతుదార్లు భయపడాల్సిన అవసరం లేదన్నారు.