పైగా షూట్ ఫొటోలను ట్విట్టర్లో పోస్టు చేయడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాలు బీజేపీ పెద్దలకు ఆగ్రహాన్ని తెప్పించాయి. తక్షణం ఫొటోలను తొలగించాలని హేమమాలినిని పార్టీ పెద్దలు ఆదేశించారు. దీంతో ఆగమేఘాలపై ఫొటోలను తొలగించిన ఆమె.. తాను చాలా సున్నిత మనస్కురాలినని, తన అవసరం ఉంటే మధురలో పర్యటిస్తానని ట్వీట్ చేశారు. ఘటనలో మృతి చెందిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.