గంటకు 165 మంది మృతి-మే నెలలో మరణ మృదంగం

బుధవారం, 2 జూన్ 2021 (18:49 IST)
భారత్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మే నెలలో దేశంలో కరోనా మహమ్మారి మృత్యు తాండవం చేసింది. గంటకు సగటున 165 మందిని పొట్టన పెట్టుకుంది. ప్రపంచంలోని ఏ దేశంలో లేనివిధంగా..... వేల మందిని బలి తీసుకుంది. మహమ్మారి ధాటికి  రోజుకు వందల మంది అసువులు బాశారు. 
 
మే నెలలో కరోనాతో భారత్ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంది. మే నెలలో రోజువారీగా నాలుగు లక్షల కేసులు దాటాయి. ప్రపంచంలో ఇప్పటివరకూ ఏ దేశంలో నమోదు కానంతగా అత్యధిక కేసులు, మృతులు మే నెలలో వెలుగు చూశాయి. మే నెలలో 33 శాతం మృతులు చోటుచేసుకున్నాయి. అలాగే 1.2 లక్షల మృతులు నమోదైనాయి. 
 
ఇక ఈ నెలలో గంటకు దాదాపు 165మంది ప్రాణాలు కోల్పోయారు. మే 19న రికార్డు స్థాయిలో 4529 మరణాలు సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా ఒక్కరోజులో నమోదైన అత్యధిక మరణాలు ఇవే. ఈ ఏడాది కేవలం ఏప్రిల్, మే నెలల్లో దాదాపు ఒకటిన్నర లక్ష మృతులు నమోదైనాయి. దేశ రాజధాని ఢిల్లీలో మరణాల రేటు అధికం. 2.9 శాతం మృతుల రేటు నమోదయ్యాయి. ఢిల్లీలో మే నెలలో 8వేలకు పైగా మృతులు చోటుచేసుకున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు