మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ బాలికను దారుణంగా హత్య చేశారు. నీటి కోసం వచ్చినందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే మధ్యప్రదేశ్లోని అలిరాజ్పూర్ జిల్లా, ఛోటా భవాటా గ్రామంలో సుర్మదా అనే 13 యేళ్ళ బాలిక తన సోదరుడితో కలిసి నీళ్లు పట్టుకునేందుకు ఓ చేతి పంపు వద్దకు వచ్చింది. అయితే ఆ చేతి పంపు యజమానులమంటూ ఇంద్రసింగ్ భిలాలా, అతడి కొడుకు మెస్టా గొడవ చేశారు.