మహారాష్ట్ర సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ పరాస్కర్ తనపై అత్యాచారం చేశాడంటూ కొద్దిరోజుల క్రితం ముంబైకి చెందిన ఓ మోడల్ పెట్టిన కేసులో బాలీవుడ్ నటి, ప్రముఖ మోడల్ పూనం పాండే వద్ద ముంబై నగర పోలీసులు వాంగ్మూలం సేకరించాలని నిర్ణయించారు. ఈ అత్యాచారం కేసులో పరాస్కర్పై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది.
ఆ తర్వాత పరాస్కర్ తనతో చనువుగా ఉండేందుకు ప్రయత్నించేవాడని, ఆ తర్వాత ఓసారి అసభ్యంగా ప్రవర్తించాడని, మరోసారి ఏకంగా అత్యాచారానికే తెగబడ్డాడని ఆమె తన ఫిర్యాదులో వివరించింది. దీనికంతటికీ సూత్రధారి పూనం పాండేనని బాధిత మోడల్ పేర్కొంది.