పెద్దనోట్ల రద్దు ప్రభావం దేశ ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన సతీమణి జశోదాబెన్ అండగా నిలిచారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని ఆమె సమర్థించుకున్నారు. దేశంలోని నల్లధనాన్ని వెలికి తీయడానికి నోట్ల రద్దు ఉపయోగపడుతుందని యశోదాబెన్ వ్యాఖ్యానించారు.
రాజస్థాన్లోని ఉదయ్ పూర్లో ఒక ప్రైవేట్ స్కూల్ స్వర్ణోత్సవంలో యశోదా బెన్ మాట్లాడుతూ.. చాలామంది గ్యాస్ సబ్సిడీని వదులుకోవడంతో.. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి చాలా మేలు కలిగిందని చెప్పారు. మహిళలు స్వశక్తితో రాణించాలని... ఇందిరాగాంధీ, మాయావతి, సుష్మాస్వరాజ్ల మాదిరి తమతమ రంగాల్లో దూసుకుపోవాలని పిలుపునిచ్చారు.