ప్రేమించానని లొంగదీసుకున్నాడు.. ఆపై స్నేహితులతో పడక పంచుకోమని?

సోమవారం, 10 సెప్టెంబరు 2018 (18:41 IST)
ప్రేమించిన పాపానికి యువతిని బెదిరించాడు. లొంగదీసుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా స్నేహితులతో కూడా గడపాలని ఒత్తిడి చేశాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. యువతి ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం బయటపడింది. వివరాల్లోకి వెళితే... పెళ్లి చేసుకొంటానని చెప్పి నమ్మించి తనను లోబర్చుకొన్న ధరన్ షా అనే వ్యక్తి సెప్టెంబర్ 9వ తేదీన తనపై అత్యాచారానికి పాల్పడినట్టుగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
కెనడా వెళ్లేందుకు సహకరిస్తానని.. అందుకు తన స్నేహితులతో కూడా పడక పంచుకోవాలని ఒత్తిడి చేశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. అంతేకాదు ఈ నెల 3వ తేదీన నిందితుడు తనపై తొలిసారిగా లైంగిక దాడికి పాల్పడినట్టు ఆమె ఫిర్యాదులో వెల్లడించింది. తనపై లైంగిక దాడికి పాల్పడిన విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని తనపై దాడికి దిగాడని చెప్పింది. 
 
పెళ్లి చేసుకొంటానని నమ్మించి తనను లోబర్చుకొన్న నిందితుడు పెళ్లి ప్రస్తావన రాగానే తనను బ్లాక్ మెయిల్  చేస్తున్నాడని బాధితురాలు వాపోయింది. ఇప్పటివరకు తన నుంచి రూ.3లక్షల నగదు, రూ.లక్ష విలువైన బంగారు నగల్ని, ల్యాప్‌టాప్‌ను తీసుకున్నట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది.
 
ఇంకా తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు