మైనర్ మేనకోడలిని గర్భవతిని చేసిన మేనమామ

సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (10:41 IST)
మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో ఘోరం జరిగింది. మేనకోడలిపై మేనమామ అత్యాచారం చేశాడు. ఈ ఘటన కొన్నేళ్ళ క్రితం పుష్కరకాలం క్రితం జరిగింది. ఈ కేసు విచారణ ముంబై ప్రత్యేక కోర్టులో సాగుతూ రాగా, తాజాగా తుదితీర్పు వెల్లడైంది. మైనర్ మేనకోడలిపై అత్యాచారానికి పాల్పడినందుకు మేనమామకు 12 యేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మేనకోడలిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన మేనమామ... ఆమె జీవితాన్ని చిన్నవయసులోనే చిదిమేశాడు. 13 యేళ్ల మైనర్ బాలిక అయిన మేనకోడలిపై 27 ఏళ్ల మేనమామ పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో ఆమె గర్భందాల్చింది. 
 
బాలిక శరీరంలో మార్పులు రావడాన్ని గమనించిన తల్లి కుమార్తెను నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పోలీసులకు బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. అయితే, ఆ తర్వాత ఫిర్యాదు ఆమె వెనక్కి తీసుకుంది. 
 
కానీ, వైద్యులు, పోలీసులు అందించిన సాక్ష్యధారాలను పరిశీలించిన ముంబై ప్రత్యేక కోర్టు నిందితుడికి 12 ఏళ్ల కఠిన కారాగారశిక్షను విధించింది. బాధితురాలి కుటుంబంతో నిందితుడు రెండున్నర నెలలు గడిపాడని... ఆ సమయంలో ఆమెను పలుమార్లు అత్యాచారం చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలడంతో జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు