మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ఘన విజయంతో ఉత్సాహంగా ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఎంపీలకు ఈనెల 26వ తేదీ ఆదివారం తేనీటి విందును ఇవ్వనున్నారు. ప్రధాని నివాసంలో జరిగే ఈ విందుకు శివసేన ఎంపీ, కేంద్ర మంతి అనంత్ గీతే కూడా హాజరు కానున్నారు. తేనీటి విందు విషయాన్ని గీతేనే వెల్లడించడం విశేషం.