''ఆమె''తో పనిచేసేందుకు నావికాదళ సైనికులు ఇబ్బందిపడ్డారు.. ఇంతకీ ఎవరామె?

సోమవారం, 28 ఆగస్టు 2017 (09:22 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైన్యంలో ట్రాన్స్‌జెండర్లకు చోటులేదని నిషేధం విధించిన నేపథ్యంలో.. నౌకాదళానికి సంబంధించి ఓ ట్రాన్స్‌జెండర్ కేసు వెలుగులోకి వచ్చింది. భారత రక్షణ దళాల్లో మహిళలకు ప్రాధాన్యం కల్పించటంతోపాటు విస్తృత స్థాయి బాధ్యతలను కూడా అప్పజెప్పాలని ఓవైపు కేంద్రం భావిస్తున్న తరుణంలో ఈ తరహా కేసు వెలుగులోకి రావటం చర్చనీయాంశంగా మారింది. 
 
నౌకాదళంలో లింగ మార్పిడి చేయించుకున్న ఓ నావికాధికారిని ఉద్యోగం నుంచి తప్పించారు. వివరాల్లోకి వెళితే.. విశాఖ ఐఎన్‌ఎస్‌ ఏకశిల బేస్‌‌లో విధులు నిర్వహిస్తున్నఓ నావికుడు కొన్ని నెలల క్రితం ఆ లింగ మార్పిడి చేయించుకున్నాడు. ప్రస్తుతం అతను మహిళగా మారిపోయాడు. ఈ నేపథ్యంలో అతను నావికాదళంలో విధులు నిర్వర్తించడం చాలా కష్టం. ఇంకా సహోద్యుగులు కూడా ఆమెగా మారిన అతనితో పనిచేసేందుకు ఇబ్బందిగా ఫీలయ్యారు. అందుకే స్వచ్ఛంధంగా విధుల నుంచి వైదొలగాలని కోరామని.. వెంటనే అతను కూడా సంతోషంగా అంగీకరించినట్లు నావికాదళానికి చెందిన ఓ అధికారి చెప్పారు. 
 
ఇంకా తానొక మగాడి శరరీరంలో చిక్కుకున్న మహిళను అంటూ తరచూ ఆ వ్యక్తి చెప్తుండే వాడని అధికారి తెలిపారు. మరోవైపు ఆపరేషన్‌కు ముందు అతనికి వివాహం కూడా జరిగినట్లు సమాచారం. ఇలాంటి సందర్భాల్లో ఆమెపై చర్యలు తీసుకునేందుకు ఎలాంటి నిబంధనలు నేవీ చట్టంలో లేకపోవటంతో రక్షణ మంత్రిత్వ శాఖను సంప్రదించినట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి