మింకపల్లిలో నక్సల్స్ స్మారక స్తూపం కూల్చివేత

శుక్రవారం, 30 జులై 2021 (17:41 IST)
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు నెలకొల్పిన అమరవీరుల స్మారక స్థూపాలను భద్రతా బలగాలు కూల్చివేస్తున్నాయి. ప్రస్తుతం మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో భద్రతా బలగాలు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
 
ఈ గాలింపు చర్యల్లో భాగంగా మావోయిస్టుల స్మారక స్థూపాలు ఎక్కడ కనిపించినా పోలీసులు కూల్చివేస్తున్నారు. గురువారం బీజాపూర్ జిల్లా మద్దేడు పోలీస్‌స్టేషన్ పరిధిలో గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా బలగాలు మింకపల్లి వద్ద స్మారక స్థూపాన్ని కూల్చివేశారు. బీజాపూర్ ఎస్‌పీ కమలోచన్ కశ్యప్ ఈ విషయం తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు