రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే జ్ఞాన్దేవ్ అహుజా మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోగడ.. దేశంలో జరుగుతున్న అత్యాచారాలు, వేధింపు కేసుల్లో 50 శాతం ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయంతెల్సిందే.
కాగా, అహుజా వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ శాఖ మండిపడింది. ఆయనకు పిచ్చి పట్టిందని, వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్చించాలని వ్యాఖ్యానించింది.