జాయ్ రైడ్ పేరుతో ఢిల్లీలో దారుణం.. కారులో యువతిపై గ్యాంగ్ రేప్

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (09:26 IST)
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. జాయ్ రైడ్ పేరుతో ఓ యువతిపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కారులో తిప్పుతూ ఈ దారుణానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఢిల్లీలోని తుఘ్లకాబాద్ ప్రాంత మురికివాడకు చెందిన 21 ఏళ్ల యువతిని ముగ్గురు యువకులు కారులో జాయ్ రైడ్ అంటూ తీసుకువెళ్లారు. దక్షిణ ఢిల్లీలోని లజపత్ నగర్ నుంచి మోతీబాగ్ మురికివాడ వరకు కారులో యువతిని తిప్పుతూ ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ చేశారు.
 
అత్యాచారం చేసిన తర్వాత బాధిత యువతిని మోతీబాగ్ ప్రాంతంలోని జనతా క్యాంపు వద్ద వదిలివెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేర పోలీసులు నిందితులైన ముబారక్ (పార్కింగ్ అటెండెంట్), డ్రైవరు ఆరిఫ్, పండ్ల విక్రేత విజయ్‌లు కలిసి యువతిపై అత్యాచారం చేశారని డీసీపీ రోమిల్ బన్నియా చెప్పారు. నిందితులను అరెస్టు చేసి కేసుపై దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి