గర్భిణి మహిళను పరిక్షించిన వైద్యులు ఆమెకు కవల పిల్లలు పుడతారని చెప్పి తీరా డెలివరీ అయ్యాక ఒక బిడ్డనే చేతికిచ్చిన ఘటన ఢిల్లీ శివారులోని నోయిడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నోయిడాకు చెందిన 23 ఏళ్ల సంగీతాదేవి ఈ నెల 20న పురిటినొప్పులతో స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చేరింది. ఆమెకు పురుడు పోసిన వైద్యులు ఒకే ఒక బిడ్డను చేతికిచ్చారు. అయితే.. డెలివరీకి ముందు కవలపిల్లలను పుడతారని వైద్యులు చెప్పారని.. ఇప్పుడు ఒక బిడ్డనే ఇచ్చారని సంగీత ఆవేదన వ్యక్తం చేసింది.