అమెరికా అధ్యక్షుడు పర్యటన చివరి నిమిషంలో మార్పు చోటుచేసుకుంది. తన పర్యటనను కుదించుకోవాల్సి వచ్చింది. దీంతో ఆయన ఆగ్రా పర్యటనను రద్దు చేసుకున్నారు. సౌదీఅరేబియా రాజు అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాచకుటుంబాన్ని పరామర్శించేందుకు ఒబామా దంపతులు రియాద్ వెళ్లాల్సి ఉంది.