ప్రతి చిన్న విషయానికి పాకిస్థాన్‌ను నిందించవద్దు : ఒమర్ అబ్దుల్లా

గురువారం, 18 ఆగస్టు 2016 (09:27 IST)
కాశ్మీర్ లోయలో జరిగే ప్రతి చిన్న విషయానికి పాకిస్థాన్‌ను నిందించవద్దని జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎన్సీ చీఫ్ ఒమర్ అబ్దుల్లా అన్నారు. లోయలో పరిస్థితిని చర్చించేందుకు ఆయన నేతృత్వంలో విపక్ష పార్టీలు బుధవారం భేటీ అయ్యాయి.
 
ఇందులో ఆయన మాట్లాడుతూ కాశ్మీర్‌ లోయలో జరిగే ప్రతి విపరిణామానికి పాకిస్థాన్‌ను నిందించడం సరైన విధానం కాదన్నారు. కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు ఏర్పడాలంటే భాగస్వామ్య పక్షాలతో చర్చలు ఒక్కటే మార్గమన్నారు.
 
బలూచిస్థాన్‌ అంశాన్ని ప్రస్తావించే ముందు కాశ్మీరీల ఆందోళననూ పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఉందన్నారు. కాశ్మీర్‌లో పెద్ద ఎత్తున భద్రతాదళాలను వినియోగించడంపై సుప్రీం రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో విచారణ కోరాలని, వాస్తవ పరిస్థితిని వివరించేందుకు త్వరలో రాష్ట్రపతిని కలుస్తున్నట్టు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి