పాకిస్థాన్లో ఉగ్రవాదులు అడ్డూఅదుపు లేకుండా రెచ్చిపోతున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొని బయటకు వస్తున్న పాకిస్థాన్ మానవ హక్కుల మహిళా నేతను దారుణంగా కాల్చి చంపేశారు. ఆమె పేరు సబీన్ మహమ్మద్. వయస్సు 40 యేళ్లు. ఈ కాల్పుల్లో ఆమె తల్లికి బుల్లెట్ గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారు.