అయితే అటార్నీ జనరల్ ముఖుల్ రోహత్గీ సూచించిన సమగ్ర ఫ్లోర్ టెస్టా? లేక మరో రూపంలో బల పరీక్ష ఉంటుందా? అన్నది తెలియాల్సి ఉంది. బుధవారం గవర్నర్ను పన్నీర్ సెల్వం, పళనిస్వామి విడివిడిగా కలిశారు. తనకు 125 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పళని చెప్పారు. అయితే పన్నీర్ మాత్రం 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా చూపించలేకపోయారు. దీంతో గవర్నర్ ఆలోచనలో పడినట్లు సమాచారం.