పట్టాలెక్కనున్న ఆరో వందే భారత్ రైలు

ఆదివారం, 11 డిశెంబరు 2022 (12:58 IST)
దేశంలో సెమీ స్పీడ్ రైళ్లు పరుగులు పెడుతున్నారు. ఈ రైళ్లకు ఆదరణ కూడా పెరుగుతుంది. దీంతో సుదూర ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం బాగా తగ్గిపోతోంది. పైగా, ఈ రైళ్లు పగటిపూట నడుస్తుండటంతో విశేష ఆదరణ లభిస్తుంది. వందే భారత్ పేరుతో నడుస్తున్న ఈ రైళ్లు ప్రస్తుతం ఐదు రైళ్లు వివిధ రూట్లలో పరుగులు తీస్తున్నాయి. 
 
తాజాగా ఆరో వందే భారత్ రైలు ఆదివారం నుంచి పట్టాలెక్కనుంది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వరకు నడిచే ఈ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం జెండా ఊపి ప్రారంభించనున్నారు. గతంలో ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం 7 గంటలుగా ఉండేది. 
 
ఇపుడు వందే భారత్ రైలు సేవలు అందుబాటులోకి వస్తే మాత్రం కేవలం ఐదున్నర గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఇది బిలాస్‌పూర్ నుంచి ఉదయం 6.45 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు నాగ్‌పూర్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నాగ్‌పూర్‌లో మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి రాత్రి 7.35 గంటలకు బిలాస్‌పూర్‌కు చేరుకుంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు