భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ సూచన చేశారు. ఆయన సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈనెల 26వ తేదీతో రెండేళ్లు అవుతున్న తరుణంలో ఈ సలహా చేశారు. పార్లమెంటేరియన్లు తమ తమ నియోజకవర్గాల్లో కనీసం వారం రోజుల పాటు గడపాలని.. అక్కడి సమస్యలు తెలుసుకోవాలని కోరారు.