భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 26న తొలిసారిగా సమావేశం కానున్నారు. ఈ భేటీలో హెచ్1బి వీసాల అంశంపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ వీసాల జారీని తగ్గించడంపై నిరసన వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. ఈ విషయాన్ని మోదీ ట్రంప్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఈనెల 25న అమెరికా పర్యటనకు బయలుదేరుతారని విదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారంనాడు వెల్లడించింది. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక మోదీ అమెరికా పర్యటనకు వెళ్తుండటం ఇదే ప్రథమం. ప్రాంతీయ భద్రత, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం, అంతర్జాతీయ పరిస్థితులూ చర్చకు రావచ్చని సమాచారం.