ఆ తర్వాత సుమారు గంటపాటు విద్యార్థులకు ఆయన పాఠాలు చెప్పారు. విస్తృతమైన అంశాలపై తన అభిప్రాయాలను పిల్లలతో పంచుకున్నారు. ముఖ్యంగా, ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న టెర్రరిజంపై విద్యార్థులతో చర్చించిన ఆయన.. భారత్లో టెర్రరిజం జాడలు లేవని అన్నారు. అలాగే సెక్యులరిజం గురించి విద్యార్థులతో మాట్లాడారు. సెక్యులరిజం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమన్నారు.