కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పగ్గాలను రాహుల్ గాంధీకి అప్పగించి సోనియా గాంధీ పక్కకు తప్పుకోవాలని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలకు సిద్దం అవుతున్న తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఓటమిలను, ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న పార్టీని పునరుత్తేజితం చేయాల్సిన బాధ్యత రాహుల్ మీద ఉందని, అందుకు సమయం కూడా ఆసన్నమైందని దిగ్విజయ్ అభిప్రాయపడ్డారు.రాహుల్ పార్టీ అధ్యక్షుడు అయ్యేందుకు ఇంకా సమయం ఆసన్నం కాలేదన్న వాదనలను ఆయన ఖండించారు.