ప్రత్యూషను తల్లిదండ్రులే వేధించారా..? రూ.70లక్షలు అప్పు తీసుకుందా? రాహుల్ చెప్పేది ఎంతవరకు నిజం?

మంగళవారం, 8 నవంబరు 2016 (14:01 IST)
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ఫేమ్ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య బాలీవుడ్ ప్రపంచాన్ని కదిలించిన సంగతి తెలిసిందే. గత  ఏప్రిల్‌లో గోరెగావ్‌లోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ప్రత్యూష కేసులో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రత్యూష తను చనిపోవడానికి ముందు రాహుల్‌కి ఫోన్‌ చేసి మూడు నిమిషాల పాటు మాట్లాడింది అనే సంభాషణ ఇప్పుడు బయటకు వచ్చింది. 
 
రాహుల్‌ని నీచుడా అంటూ తిట్టిందని.. తనను అమ్ముకోవడానికి ఇక్కడికి రాలేదని.. తన కెరీర్ కోసం నటించేందుకు వచ్చానని.. కానీ తనను వ్యభిచారిని చేశావ్.. నువ్వు చేసిన పనికి చాలా బాధపడ్డానని దూషించింది. రాహుల్‌ని స్వార్థపరుడని, తన తల్లిదండ్రులు సమాజంలో తలెత్తుకోలేక చేశావని ఆగ్రహం వ్యక్తం చేసింది.  ప్రత్యూష మాట్లాడిన తర్వాత రాహుల్‌.. ఎలాంటి అఘాయిత్యం చేసుకోవద్దని అరగంటలో వస్తున్నానని చెప్పి ఫోన్‌ పెట్టేసినట్లు తెలిసింది. రాహుల్‌ వచ్చేటప్పటికే ప్రత్యూష చనిపోయిందని, ఆడియో ప్రకారం చూస్తే.. రాహుల్‌ ప్రత్యూషని వ్యభిచారంలోకి దించడానికి ప్రయత్నించాడని తేలినట్లు లాయర్‌ నీరజ్‌ గుప్తా తెలిపారు. ఈ కేసు విషయమై మళ్లీ విచారణ జరపాల్సిందిగా పిటిషన్‌ వేస్తున్నట్లు వెల్లడించారు. 
 
అయితే రాహుల్ మాత్రం ప్రత్యూష మరణానికి ఆమె తల్లిదండ్రులే కారణమని చెప్తున్నాడు. డబ్బు సంపాదించమని ప్రత్యూషను వేధించేవారని, ఈ క్రమంలో రూ. 70 లక్షలను బ్యాంక్ నుంచి లోన్‌గా తీసుకుందని రాహుల్ వెల్లడించాడు. 
 
ఈ అప్పుల్ని ఎలా తీర్చాలో తెలియక తామిద్దరం ఆలోచించేవాళ్లమని.. ప్రత్యూష చివరిసారిగా తనకు కాల్ చేసినప్పుడు ''నేను మా అమ్మా,నాన్నలకు పుట్టలేదనుకుంటా... అందుకే నన్ను ఇంతలా వేదిస్తున్నారు'' అని బాధపడిందని రాహుల్ తెలిపాడు. చేతిలో ఛాన్సులు లేకపోవడానికి తోడు భారీ మొత్తం అప్పు కట్టలేక.. తల్లిదండ్రుల ఒత్తిడి తాళలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని రాహుల్ వ్యాఖ్యానించాడు. మరి ఈ కేసులో నిజానిజాలేంటో తెలియాలంటే వేచి చూడాల్సిందే. 

వెబ్దునియా పై చదవండి